WorldWonders

Breaking: కాల్చి అవతల పారేశారు

Breaking:

ఉత్తరప్రదేశ్‌లో 8 మంది పోలీసుల కాల్చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు, గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గురువారం పట్టుబడ్డ వికాస్‌ను ప్రత్యేక వాహనంలో కాన్పూర్‌కు తరలిస్తుండగా పోలీసుల ఎస్కార్ట్‌లోని ఓ వాహనం బోల్తా పడింది. దీనిని అదునుగా తీసుకున్న వికాస్‌ పారిపోయేందుకు ప్రయత్నించడమే గాక పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో ఇరువర్గాలకు మధ్య జరిగిన కాల్పుల్లో పోలీసులు వికాస్‌ హతమయ్యాడు.