Sports

భారత క్రీడాకారిణి కారు అమ్ముకుంటోంది

భారత క్రీడాకారిణి కారు అమ్ముకుంటోంది

భారత అగ్రశేణి స్పింటర్‌ ద్యుతీ చంద్‌ విలువైన బీఎం‌డబ్ల్యూ కారును అమ్మేందుకు సిద్ధపడ్డారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా శిక్షణ ఖర్చులు తీర్చేందుకు బీఎం‌డబ్ల్యూ కారును సోషల్‌ మీడియాలో అమ్మకానికి పెట్టారు. ఈ విషయాన్ని ద్యుతీనే ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. ‘నా లగ్జరీ బీఎం‌డబ్ల్యూ కారును అమ్మాలనుకుంటున్నాను. ఎవరైనా కొనాలి అనుకుంటే నాకు మెసేంజర్‌లో సంప్రదించండి’ అంటూ కారుకు చెందిన ఫోటోలను పోస్టులో పెట్టారు. అయితే ఫేసుబుక్‌లో పోస్ట్‌ పెట్టిన తర్వాత ఆమెకు సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో తరువాత ఆ పోస్టును స్పింటర్‌ రాణి డిలీట్‌ చేశారు. కాగా ద్యుతీ 2015 బీఎం‌డబ్ల్యూ3- సిరీస్‌ మోడల్‌ను కలిగి ఉన్నారు. ఆమె దానిని 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు.