Devotional

సోమవారం నుండి సుబ్రహ్మణ్యేశ్వరుని బ్రహ్మోత్సవాలు

సోమవారం నుండి సుబ్రహ్మణ్యేశ్వరుని బ్రహ్మోత్సవాలు

మోపిదేవిలో స్వయంభూగా వెలసిన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పవిత్రోత్సవాలు ఈ నెల 13వ తేదీ నుంచి 16 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ సహాయ కమిషనర్‌ లీలాకుమార్ శనివారం తెలిపారు. కొవిడ్-19 కారణంగా భక్తులను పరిమిత సంఖ్యలోనే ఉత్సవాలకు అనుమతి ఇస్తామన్నారు. 13వ తేదీన పూజా కార్యక్రమాలు, 14న స్వామివారికి పట్టు పవిత్రములు సమర్పణ, 15న సుబ్రహ్మణ్య మూల మంత్రహోమం,16న కూరగాయలతో శాకాంబరిగా అలంకరణ, 11మంది రుత్వికులతో విశేష పూజా కార్యక్రమాలు, లక్ష బిల్వార్చన, శాంతి కల్యాణం, తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు లీలాకుమార్ తెలిపారు. 16న స్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా పూజల్లో పాల్గొనే భక్తులు దేవాలయం నిర్దేశించిన రుసుం చెల్లించి పాల్గొనవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 08671257240 ఫోన్‌ నంబరులో సంప్రదించాలని భక్తులకు సూచించారు.