Movies

అడవుల్లో అన్వేషణ

అడవుల్లో అన్వేషణ

కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా మూడు నెలలుగా సినిమా చిత్రీకరణలు నిలిచిపోయాయి. ఇటీవల ప్రభుత్వం షరతులతో షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో స్వీయ జాగ్రత్తలు, భద్రతా ప్రమాణాల్ని పాటిస్తూ కొందరు దర్శకనిర్మాతలు షూటింగ్‌లకు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విద్యాబాలన్‌ కథానాయికగా నటిస్తున్న ‘షేర్ని’ సినిమా చిత్రీకరణ సెప్టెంబర్‌లో ప్రారంభంకానున్నది. ఈ సినిమాలో విద్యాబాలన్‌ అటవీ అధికారిణిగా కనిపించబోతున్నది. మనుషులకు, జంతువులకు మధ్యనున్న శత్రుత్వానికి పరిష్కారాన్ని అన్వేషించే పాత్రలో ఆమె కనిపించబోతున్నారు. వరల్డ్‌ వైల్డ్‌లైఫ్‌ దినోత్సవం సందర్భంగా మార్చి 3న సినిమా చిత్రీకరణను ప్రారంభించారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆ తర్వాత షూటింగ్‌కు బ్రేక్‌పడింది. తాజాగా చిత్రబృందం సెప్టెంబర్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. మధ్యప్రదేశ్‌ అడవుల్లో విద్యాబాలన్‌పై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.