Business

వినాయక విగ్రహాలకు కరోనా సెగ

వినాయక విగ్రహాలకు కరోనా సెగ

కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అన్ని పరిశ్రమలపైన పడింది. పరిశ్రమలు నడవక అనేక మంది ఉపాధి కోల్పోయారు. ఆర్థికంగ ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా కరోనా ప్రభావం వినాయకుడి విగ్రహాల తయారీ పరిశ్రమపైన పడింది. గణపతి నవరాత్రుల సంబరాలపై కరోనా ప్రభావం అధికంగా ఉంది. విగ్రహాలకు డిమాండ్‌ గణనీయంగా తగ్గిపోయింది. వందలాది కుటుంబాలు స్వస్థలాలకు తరలివెళ్లారు. ముడిసరుకు లభ్యం కాకపోవడంతో వినాయక విగ్రహాల తయారీ తగ్గింది. ఈ ఏడాది ఏమవుతుందోనని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను గుర్తించి, ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.