DailyDose

ఆటోల్లో కరోనా మృతదేహాలు-నేరవార్తలు

ఆటోల్లో కరోనా మృతదేహాలు-నేరవార్తలు

* గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామం లొ హై టెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరి బాలల పరిస్థితి విషమం .మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ కు తరలింపు .వీరిలో చౌ టపల్లి అరవింద్ (8)ఆరోగ్యం ఆందోళన కరంగా ఉన్నట్లు సమాచారం.

* అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం మాల్యవంతఒ పెట్రోల్ బంక్ వద్ద ఆటో ని డి కొన్న లారీ నలుగురు మృతి.

* విశాఖలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు.విశాలాక్షి నగర్​లో విజయ్​కుమార్ అనే యువకుడు వార్డు సచివాలయ భవనం మూడో అంతస్తు పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు.సమాచారం అందుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న అతని మృతదేహాన్ని కేజీహెచ్​కు తరలించారు.అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతుని స్నేహితులను విచారిస్తున్నారు.

* నిజామాబాద్ ప్రభుత్వ జనరల్​ ఆసుపత్రిలో కొవిడ్​తో మృతి చెందిన వ్యక్తి శవాన్ని ఆటోలో తీసుకెళ్లిన ఘటనపై విచారణ కమిటీ మధ్యంతర నివేదిక సమర్పించింది. సిబ్బందిపై ఒత్తిడి చేసి మృతుడి బంధువులు ఆటోలో తీసుకెళ్లినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

* గుత్తి పట్టణంలోని పలు కాలనీలలోనీ 4 ఇండ్లలో చోరీ. సుమారు 1 లక్ష రూపాయల నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని దుండగులు.