కరోనా వైరస్కు కళ్లెం వేసే టీకా కోసం యావత్తు ప్రపంచం ఎదురుచూస్తున్న వేళ అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ కీలక ప్రకటన చేసింది. ప్రయోగ దశలో ఉన్న తమ టీకా ప్రాథమిక క్లినికల్ ట్రయల్స్లో ఆశాజనక ఫలితాలిచ్చినట్లు మంగళవారం వెల్లడించింది. తొలిదశలో భాగంగా 45 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్ను ఇచ్చినట్లు తెలిపింది. కరోనాపై పోరాడే రోగనిరోధక శక్తి వీరిలో ఏర్పడినట్లు గుర్తించామని వెల్లడించింది. అలాగే ఈ టీకా సురక్షితమైనదని కూడా ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు తెలిపింది. ఈ మేరకు ‘న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో తమ పరిశోధనా ఫలితాల్ని ప్రచురించింది
మొడెర్నా టీకా సత్ఫలితం
Related tags :