Politics

అమరావతి కుంభకోణంలో తహశీల్దారు అరెస్టు

అమరావతి కుంభకోణంలో తహశీల్దారు అరెస్టు

గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న రాజధాని భూ కుంభకోణంలో ఇద్దరు కీలక వ్యక్తులను సీఐడీ బుధవారం అరెస్టు చేసింది. అసైన్డ్‌ భూములను కొనుగోలు చేసిన గుమ్మడి సురేశ్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. విజయవాడకు చెందిన సురేశ్‌.. దళితులు సాగుచేసుకుంటున్న అసైన్డ్‌ భూములను నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసిన నేపథ్యంలో అతడిని అరెస్టు చేశారు. అదే విధంగా భూ రికార్డుల తారుమారు వ్యవహారంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న తుళ్లూరు రిటైర్డ్‌ తహసిల్దార్‌ సుధీర్ ‌బాబును కూడా అరెస్టు చేశారు. ఈ క్రమంలో వీరిద్దరిని మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా.. ఈ నెల 29 వరకు న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. దీంతో సురేశ్‌, సుధీర్‌ బాబును గుంటూరులోని జైలుకు తరలించారు.