Editorials

భారత శాంతి కోసం నేను పోరాడుతాను

Trump Promises India China Peaceful Relation

భారత, చైనా ప్రజలు శాంతియుతంగా ఉండటానికి సాధ్యమైన ప్రతి పనినీ చేయాలనుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ‘‘నేను భారత ప్రజలూ ఇష్టపడతా. చైనా ప్రజలనూ ఇష్టపడతా. ప్రజలు శాంతియుతంగా ఉండటానికి అవసరమైన ప్రతి పనినీ చేస్తా’’ అని ట్రంప్ అన్నారని ఆయన మీడియా కార్యదర్శి తెలిపారు. కొన్ని రోజుల క్రితం ట్రంప్ ఆర్థిక సలహాదారు లారీ కుడ్లో మాట్లాడుతూ.. ఇండియా అమెరికాకు గొప్ప మిత్ర దేశమని, నరేంద్ర మోదీకి ట్రంప్ గొప్ప స్నేహితుడన తెలిపారు. అయితే ట్రంప్ ప్రకటనపై ఇండియా-అమెరికన్ ఫైనాన్స్ కమిటీ కో చైర్మన్ అల్ మసన్ మాట్లాడుతూ… ‘‘ఇలా చెప్పే ధైర్యం ఒక్క ట్రంప్‌కు మాత్రమే ఉంది. నమస్తే ట్రంప్ ర్యాలీలో భారీ సంఖ్యలో భారతీయులు పాల్గొన్నారు. భారతీయులపై ట్రంప్ ప్రేమ స్థిరంగానే ఉంటుంది’’ అని అల్ మసన్ తెలిపారు.