DailyDose

సత్తుపల్లిలో నకిలీ మావోయిస్టుల బెదిరింపులు-నేరవార్తలు

Crime News Roundup - Fake Maoists Money Collection In Sattupalli

* ఈజీ మనీ కోసం మావోయిస్టులు పేరుచెప్పి డబ్బులు వసూలు చేస్తున్న ముఠా పట్టివేత. విజయలక్ష్మి intuc లీడర్ & గాంగ్ సత్తుపల్లి సింగరేణి (ఓ బి ) కాంట్రాక్ట మహాలక్ష్మి కాంప్ HR మేనేజర్ జిత్తు ను బెదిరించి 50 లక్షలు డిమాండ్ చేయగా వారికి 5 లక్షలు రూ ఇవ్వడం జరిగింది . మరోమారు ఇదేవిధంగా డబ్బులు డిమాండ్ చేయడంతో పోలీసులకు సమాచారం అందించడం తో వారిని పట్టుకోవడం జరిగింది వారి వద్ద నుండి రెండు నకిలీ తుపాకీలు , కార్ 2, 2 లక్ష లు, సెల్ ఫోన్లు రూ స్వాధీనం చేసుకున్న పోలీసులు.

* తాజాగా, ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది …..స్కానింగ్, ఎక్సరే కోసం స్టేట్ కోవిడ్ ఆస్పత్రి సిబ్బంది కరోనా రోగిని బయటకు పంపేశారంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది.ఎలాంటి జాగ్రత్తలు లేకుండా రోగిని బయటకు వదిలేశారు. దీంతో నడిరోడ్డుపై రోగిని స్ట్రేచర్‌పై బంధువులు పరీక్షలు తీసుకెళ్లారు.ఈ సందర్భంగా ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని ప్రశ్నించగా, సాయానికి ఎవరూ రాలేదని చెప్పారు.”అయితే వాస్తవానికి ఆయన కరోనా రోగి కాదని అక్కడి అధికారులు చెప్పారు.ఆయన ఇటీవలే యాక్సిడెంట్ కాగా, ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు.అయితే సీటీ స్కానింగ్ చేయాలని అధికారులు చెప్పగా.. డాక్టర్లకు చెప్పకుండా కుటుంబ సభ్యులు తీసుకెళ్లిపోయినట్లు తెలిపారు.కానీ, ఈ వీడియోను పలువురు వైరల్ చేస్తున్నారు. కరోనా రోగిని ఇలా ఎలా వదిలేశారని ప్రశ్నిస్తున్నారు.అయితే వాస్తవం మాత్రం వేరేగా ఉంది.

* అదుపుతప్పి బోల్తా పడిన లారీ. సోంపేట మండలం పాలవలస సమీపంలో అదుపుతప్పి లారీ బోల్తా కొట్టింది. ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన లారీ డ్రైవర్, క్లినర్.

* ఉత్తర్​ప్రదేశ్ కనౌజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు, మరో వాహనం ఢీకొన్నాయి.ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.బస్సు బిహార్ దర్బంగా నుంచి దిల్లీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

* విశాఖ ఏజెన్సీలో యువకుడు దారుణ హత్యవిశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీలో ఆదివారం ఉదయం ఓ యువకుడ్ని కొందరు గుర్తు తెలియని దుండుగులు దారుణంగా హత్య చేశారు.పెడబయలు మండలం గంపరాయి మలుపు వల్లంగి వద్ద ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.చనిపోయిన వ్యక్తిని రామకృష్ణ (21)గా స్థానికులు గుర్తించారు.స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

* రైల్వే అండర్ బ్రిడ్డి కింద నీటిలో ఒక బస్సు చిక్కుకోగా అందులోని డ్రైవర్ మునిగి మృతి చెందాడు. ఢిల్లీలోని మింటో ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

* చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం…ఆస్తి కోసం కన్న తల్లిని తలపై నరికిన కసాయి కొడుకు….కుప్పం కొత్తపేటలో నివసిస్తున్న కమలమ్మ ఆస్తి తగదాలు కారణంగా ఆఖరి కుమారుడు మహేంద్ర కత్తితో తల్లిపై దాడి.