తెలుగుతో సహా పలు దక్షణ భారతీయ సినిమాలలో నటించిన నటుడు అర్జున్ కుటుంబంలో పలువురికి కరోనా సోకింది. తాజాగా ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్కు కరోనా వైరస్ వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘‘నాకు కొవిడ్-19 వ్యాధి సోకినట్టు ఇటీవలే నిర్ధారణ అయింది. వైద్య నిపుణుల సలహాతో నేను హోం క్వారంటైన్లో ఉంటున్నాను. ఇటీవలి కాలంలో నా సమీపంలోకి వచ్చిన వారు దయచేసి జాగ్రత్త వహించాల్సిందిగా కోరుతున్నాను.’’ అని ఆమె ప్రకటించారు. ఇక అర్జున్ మేనల్లుడు ధృవ సర్జా, అయన భార్య ప్రేరణకు కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ధృవ, ఇటీవల మృతి చెందిన కన్నడ నటుడు చిరంజీవి సర్జా సోదరుడు. ఈయన, రశ్మిక మందన కలసి నటించిన కన్నడ చిత్రం ‘పొగరు’ మార్చిలో విడుదల కావాల్సి ఉండగా.. కరోనా ప్రభావంతో వాయిదా పడింది.
ఐశ్వర్య అర్జున్కు కరోనా
Related tags :