Health

అంబటికి కరోనా పాజిటివ్-TNI బులెటిన్

అంబటికి కరోనా పాజిటివ్-TNI బులెటిన్

* కరోనా మహమ్మారి దెబ్బకు ఏపీ తల్లడిల్లుతోంది. మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. రోజురోజుకూ కేసులు ఊహించని స్థాయిలో పెరుగుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గ్రామాలకు సైతం కరోనా విస్తరిస్తుండటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 6,045 కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.

* తిరుపతి – క్వారంటైన్ కు వెల్లి వచ్చినా కుటుంబాన్ని ఇంటిలోకి రానివ్వని ఇంటి యజమాని.- తిరుపతి సుందరయ్య నగర్లో ఘటన.- ఇంటికి తాళాలు వేసుకుని వెళ్లిపోయిన ఇంటి ఓనర్.- పోలీసులు వార్డు వాలంటీర్లు చెప్పిన వినుకోని ఇంటి యజమాని.- ఇంటి బయటే పడిగాపులు కాస్తున్న బాధిత కుటుంబం.

* కరోనా బారిన పడి బాలల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి. అచ్చుతరావు కాసేపటి క్రితం మలక్ పేట యశోద ఆసుపత్రిలో మరణించారు

* ఏపీలో 61818 కు చేరిన కరోనా పాజిటీవ్ కేసులు.ఇతర రాష్ట్రాల, విదేశాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 64713

* వైసీపీ కీలక నేతలందరూ వరుసగా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి పాజిటివ్ అని నిన్న రాత్రి తేలగానే పార్టీ శ్రేణులు కలవరపాటుకు గురయ్యాయి. ఇప్పుడు తాజాగా పార్టీ కీలక నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కూడా కరోనా నిర్ధారణ అయింది. టెస్టుల్లో పాజిటివ్ అని తేలిన వెంటనే ఆయన క్వారంటైన్ లోకి వెళ్లారు. మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.