టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
కడియంతో పాటు ఆయన ఇద్దరు గన్మెన్లకు, పీఏ, డ్రైవర్కు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.
నిన్నటి వరకు హోం ఐసోలేషన్లో ఉన్న శ్రీహరికి.. మంగళవారం సాయంత్రం కరోనా పరీక్షలు నిర్వహించగా ఫలితం పాజిటివ్ వచ్చింది.
ఈ క్రమంలో కడియం శ్రీహరి హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందనున్నారు.