NRI-NRT

బాలభారతి పాఠశాలకు ₹10లక్షలు విరాళమిచ్చిన కర్నూలు ఎన్నారై

Kurnool NRI Foundation Donates 10Lakhs To Orphan School

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపులక్ష్మీ ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలకు ₹10లక్షల విరాళాన్ని కర్నూలు NRI ఫౌండేషన్ అందించింది. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‍ రెడ్డి ఈ చెక్కును పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతికి అందజేశారు. అనాధ విద్యార్థులకు ఆటంకాలు లేకుండా విద్యనందించాలనే లక్ష్యంతో ఈ విరాళాన్ని అందజేస్తున్నట్లు కర్నూలు NRI ఫౌండేషన్‍ వ్యవస్థాపకులు రవి పొట్లూరి తెలిపారు. వచ్చే అయిదేళ్లలో బాలభారతి పాఠశాలకు ₹50లక్షల రూపాయలను విరాళంగా ఇస్తామని ఆయన న్నారు. ప్రవాసుల సేవానిరతిని ఎమ్మెల్యే రాంభూపాల్‍ రెడ్డి అభినందించారు. ఎన్నారైల సహకారంతో విద్య, వైద్య రంగాల్లో సేవలు అందిస్తామని, నిరుద్యోగ యువతలో నైపుణ్యం పెంపొందించే విధంగా శిక్షణా శిబిరాలు, సదస్సులు నిర్వహిస్తామని, జిల్లాకు చెందిన కళాకారులను, మేధావులను, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని ఫౌండేషన్‍ సమన్వయకర్త ముప్పా రాజశేఖర్ తెలిపారు.