కరోనా విజృంభన నేపథ్యంలో గణేష్ ఉత్సవాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్న బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి.
ఈ సారి 21 అడుగులకు బదులు 6 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించటం జరిగింది.
ప్రతి సంవత్సరం నిర్వహించే లడ్డు వేలం ఈ సంవత్సరం నిర్వహించడం లేదు.
ఈ సంవత్సరం మొదటి పూజ కేవలం కమిటీ సభ్యుల అద్వర్యంలో జరుగుతుంది.
ఈ సంవత్సరం భక్తులు ఎలాంటి పూజలు…మరియు దర్శనాలు అనుమతులు లేవు
ప్రతి సంవత్సరం జరిగే గణేష్ శోభాయాత్రకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.
దయచేసి భక్తులందరూ ఈ సంవత్సరం జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సహకరించాల్సిందిగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి మనవి.