Politics

బెజవాడలో నూతనంగా 11 చోట్ల ఆంక్షలు

బెజవాడలో నూతనంగా 11 చోట్ల ఆంక్షలు

నగరంలోని 11 ప్రాంతాల్లో శనివారం నుండి ఆంక్షలు అమల్లో వుంటాయని జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ప్రకటన.

పటమట, కృష్ణలంక, కొత్తపేట, మొగల్రాజపురం, విద్యాధరపురం, అజిత్ సింగ్ నగర్, భవానీపురం, చుట్టుగుంట, సత్యనారాయణపురం, వించిపేట, చిట్టినగర్ ప్రాంతాల్లోని 21 జోన్లలో వారం రోజుల పాటు కట్టుదిట్టమైన ఆంక్షలు.

ఉదయం గం.6.00 నుండి గం.11.00ల వరకు మాత్రమే వ్యాపారాలకు అనుమతి. నిత్యావసర దుకాణాలు, మందుల షాపులకు ఆంక్షల నుండి మినహాయింపు.

కంటైన్మెంట్ జోన్లలోని ప్రజలకు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల ద్వారా వైద్య పరీక్షలు, కంటైన్మెంట్ జోన్లలోని ప్రజలకు అధికంగా టెస్టులు నిర్వహించడం ద్వారా కరోనా కట్టడి సాధ్యమని భావిస్తున్న అధికారులు.

బ్యారికేడ్లు ఏర్పాటు ద్వారా రాకపోకలపై నియంత్రణ, కోవిడ్ జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేలా మైక్ ద్వారా ప్రచారం.

వ్యాపారాలు, ఉద్యోగాల నిమిత్తం కంటైన్మెంట్ జోన్ల నుండి బయటికి వెళ్లే వారికి థర్మల్ స్క్రీనింగ్, పల్స్ ఆక్సీ మీటర్ పరీక్షలు