Health

నేడు తెలంగాణాలో 1640 కరోనా పాజిటివ్ కేసులు

నేడు తెలంగాణాలో 1640 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా 1,640 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 52,466కి చేరంది. ఈ మేరకు వైద్య,ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న 1,007 మంది డిశ్చార్జి కావడంతో.. ఇప్పటివరకు వైరస్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 40,334గా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,677కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా కరోనాతో 8 మంది మృతిచెందడంతో….రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 455కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 683 ఉన్నాయి.