Politics

రాయపాటి ఆస్తుల వేలం

రాయపాటి ఆస్తుల వేలం

టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాయపాటి హామీదారుడిగా వ్యవహరిస్తున్న ట్రాన్స్‌ట్రాయ్‌ లిమిటెడ్‌ ఆస్తుల వేలానికి రంగం సిద్ధమైంది. సెంట్రల్‌ బ్యాంక్‌కు సుమారు రూ.452.41 కోట్లు ట్రాన్స్‌ట్రాయ్‌ బకాయి పడింది. కాగా తనఖా పెట్టిన ఆస్తులను ఆగస్టు 18న వేలం వేయనున్నట్లు సెంట్రల్‌ బ్యాంక్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో బిడ్స్‌ దాఖలుకు ఆగస్టు 14న చివరి తేది అని ప్రకటించింది. అయితే 2017 జనవరి 9నాటికి సెంట్రల్‌ బ్యాంక్‌కు చెల్లించాల్సిన మొత్తం 452.41 కోట్లు కాగా, వీటికి హామీదారులుగా ట్రాన్స్‌ట్రాయ్‌ మాజీ ఎండీ శ్రీధర్‌, రాయపాటితోపాటు మరో ఐదుగురు ఉన్నారు. ఇదే కాక ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కెనరా బ్యాంక్‌కు సంబంధించి సుమారు రూ.300 కోట్లు మోసం చేసిన కేసులోనూ రాయపాటిపై సీబీఐ కేసు నమోదైంది. ఈ బకాయిలు మాత్రమే కాకుండా వివిధ బ్యాంకుల ద్వారా రూ.3,694 కోట్ల మేర రుణాలను ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ తీసుకుంది.