Politics

గోవులను బలి చేయకండి

గోవులను బలి చేయకండి

బక్రీద్‌ పండగ సందర్భంగా ఆవులను బలి ఇవ్వవద్దని హోమ్‌మంత్రి మహమూద్‌అలీ ముస్లిం సోదరులకు విజ్ఞప్తిచేశారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలను సమానంగా పరస్పరం గౌరవించుకుంటున్నామని అన్నారు. అదే తరహాలో బక్రీద్‌ పండగను జరుపుకోవాలన్నారు. ఈమేరకు డీజీపీ మహేందర్‌రెడ్డితో భేటీ అయిన హోమ్‌మంత్రి మాట్లాడుతూ చారిత్రక చార్మినార్‌ లోని నాలుగు మినార్లు హిందూ, ముస్లిం, సిఖ్‌, క్రిస్టియన్‌లుగా భావిస్తామని, ఈ విధంగా అన్ని మంతాలను కులాలను సమానంగా గౌరవించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. గోవులను హిందువులు పూజిస్తున్నందు ఎప్పటిలాగే వాటిని బలి ఇవ్వవద్దని కోరారు. ఈ సమయంలో పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. తద్వారా ఇతరులకు హాని కలిగించకుండా వ్యవర్ధాలను రోడ్లు, వీదుల్లో పారవేయ వద్దన్నారు. ప్రార్ధనలు, జంతువుల అమ్మకం, కొనుగోలు సమయంలో కరోనావైరస్‌ వ్యాప్తి చెందకుండా సురక్షితమైన స్వయం నియంత్రణ పాటించాలని కోరారు