NRI-NRT

నాట్స్ 2020-22 అధ్యక్షుడిగా విజయశేఖర్ అన్నే

నాట్స్ 2020-22 అధ్యక్షుడిగా విజయశేఖర్ అన్నే

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 2020-22 సమయానికి నూతన కార్యనిర్వాహక కమిటీని ప్రకటించింది. డాలస్‌కు చెందిన అన్నె విజయశేఖర్ నూతన అధ్యక్షుడిగా, బాపయ్య చౌదరి నూతి, న్యూజెర్సీకి చెందిన వంశీకృష్ణ వెనిగళ్ల, మిస్సోరికి చెందిన రమేశ్ బెల్లం, ప్లోరిడాకు చెందిన శ్రీనివాస్ మల్లాదిలు ఉపాధ్యక్షులుగా, సెక్రటరీగా రంజిత్ చాగంటి, ట్రెజరర్‌గా మదన్ పాములపాటి, జాయింట్ సెక్రటరీగా జ్యోతి వనం, జాయింట్ ట్రెజరర్‌గా హేమంత్ కొల్ల, హెల్ప్ లైన్ ఫండ్ రైజింగ్ రామ్ నరేశ్ కొమ్మనబోయిన, ఇండియా లైజన్ శ్రీని గొంది, మార్కెటింగ్ రవి గుమ్మడిపూడి, మెంబర్ షిప్ అశోక్ కుమార్ గుత్తా, స్పోర్ట్స్ చంద్రశేఖర్ కొణిదెల, మీడియా రిలేషన్స్ అండ్ సోషల్ మీడియా శ్రీనివాస్ కాకుమాను, వుమెన్ ఎంపవర్‌మెంట్ జయశ్రీ పెద్దిబొట్ల, ప్రోగ్రామ్స్ లక్ష్మీబొజ్జ, కిరణ్ కొత్తపల్లి, కిరణ్ యార్లగడ్డ, రాజేశ్ కాండ్రు, భాను లంక, కృష్ణ నిమ్మగడ్డ, కోటేశ్వరరావు బోడెపూడి, రామ్ కొడితలలు జోనల్ వైస్ ప్రెసిడెంట్లుగా, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ(వెబ్) సుధీర్ కుమార్ మిక్కిలినేని, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా రిలేషన్స్) మురళీకృష్ణ మేడిచర్ల, నాట్స్ హెల్ప్‌లైన్ టీమ్ 1-888-4835848కు సతీష్ ముమ్మనగండి, గృహహింస బాధితుల విభాగానికి కవిత దొద్దాలు సేవలు అందించనున్నారు. గత రెండేళ్లుగా సంస్థను బలోపేతం చేసి సమర్థవంతంగా సేవలందించిన మంచికలపూడి శ్రీన్వీఅస్‌కు, నూతన కార్యవర్గానికి బోర్డు ఛైర్మన్ అప్పసాని శ్రీధర్, కార్యదర్శి పిన్నమనేని ప్రశాంత్‌లు అభినందనలు తెలిపారు. నాట్స్‌ను ప్రవాసులకు మరింత చేరువ చేసేలా చర్యలు చేపడతానని విజయశేఖర్ తెలిపారు.