Politics

ఇంకోసారి పేకాటతో నా పేరు కలిపితే పరువునష్టం కేసు పెడతా

ఇంకోసారి పేకాటతో నా పేరు కలిపితే పరువునష్టం కేసు పెడతా

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కామెంట్స్..

ఎమ్మెల్యే శ్రీ దేవి పేకాట ఆడిస్తుందని తప్పుడు కధనాలు వస్తున్నాయి.

జరిగిన విషయాలతో నాకు ఎలాంటి సంబంధం లేకున్నా నిజాలు చెప్పేందుకు మీడియా ముందుకు వచ్చా.

నంబూరు గ్రామంలో పేకాట నిర్వహణ జరిగింది కాని తాడికొండ నియోజకవర్గంలో కాదు.

దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు.

పేకాట సిబిరం ఏర్పాటు పై పోలీసులు పూర్తి విచారణ చేయాలి.

మహిళా ఎమ్మెల్యే అని కూడా కూడా చూడకుండా నా పై దుష్ప్రచారం చేస్తున్నారు.

ఇష్టం వచ్చినట్టు కట్టు కధలు రాస్తూ నేను పేకాట ఆడిస్తున్నానని చెప్పడం సిగ్గు చేటు.

నేను ఏ పోలీసులకు ఫోన్ చేసి పేకాట నిర్వహకులను వదిలేయమని చెప్పలేదని కంటతడి పెట్టిన ఎమ్మెల్యే.

దీని పై ఎపి డిజిపిని కలిసి ఫిర్యాదు చేస్తా.

ఏ ఛానలైనా నాపై తప్పుడు కధనాలు రాస్తే పరువునష్టం దావా వేస్తా.

పేకాట కేసులోని వాస్తవాలు పోలీసుల విచారణలో భయట పడతాయి.

ఇప్పటికైనా డాక్టర్,మహిళా ఎమ్మెల్యే అయిన నా పై తప్పుడు కధనాలు రాయవద్దు నిజాలు తెలుసుకుని కధనాలు రాయాలి.

మహిళా అధికారాన్ని అణచివేసేలా వ్యవహరించడం సరైన విధానం కాదు.