Politics

కోలుకున్న విజయసాయి

కోలుకున్న విజయసాయి

కరోనా బారిన పడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోలుకున్నారు.

కరోనా సోకిన వెంటనే ఎంపీ హైదరాబాద్‌లో చికిత్స తీసుకున్న ఎంపీ కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యారు.

ఈ సందర్భంగా తాను కోలుకోవాలని ఆశించిన ప్రతీఒక్కరికీ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

‘‘భగవంతుడి దయతో, శ్రేయోభిలాషుల ప్రార్థనల బలంతో కోలుకున్నాను.

అందరికీ కృతజ్ఞుడిని. మానవాళి అస్థిత్వానికి సవాలుగా మారిన కరోనాను ప్రతి ఒక్కరూ జయించాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.