DailyDose

మత్తు కోసం శానిటైజర్లు మింగేస్తున్న మందుబాబులు-నేరవార్తలు

Drunkards Drinking Sanitizers For Kick - Crime News

* రాష్ట్రంలో శానిటైజర్ మరణాలు ఆగడం లేదు. మద్యానికి బానిసై మందు దొరక్క వ్యసనపరులు శానిటైజర్ తాగుతున్నారు.కడప జిల్లా పెండ్లిమర్రికి చెందిన ముగ్గురు శానిటైజర్​ తాగి మృత్యువాత పడ్డారు. నిన్న శానిటైజర్‌ తాగి ఇద్దరు మరణించారు. ఇవాళ మరో వ్యక్తి మృతి చెందాడు.వారం రోజుల నుంచి ఆరుగురు శానిటైజర్‌ తాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు చనిపోవడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.

* తుళ్లూరులో రాజధాని రైతుల నిరసన దీక్ష..రైతుల దీక్షకు సంఘీభావం తెలిపిన టీడీపీ నేత బీటెక్ రవి.ధైర్యముంటే కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి..జగన్ కు భయపడి రాజీనామా చేయలేకపోతున్నారా.రాజధానికి సంబంధంలేని నేను రాజీనామా చేశా..ఇక్కడ రైతులంతా పెయిడ్ ఆర్టిస్టులు అయితే మీరు రాజీనామా చేసి మళ్ళీ గెలవండి.మీరు గెలిస్తే నేను శాశ్వతంగా రాజకీయల నుంచి తప్పుకుంటా.

* వైసీపీ నేతలకు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఓ హెచ్చరిక చేశారు.తనను తిట్టి బంగారు రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు.తనను తిట్టమన్నారని తాత్కాలికంగా తిట్టి పర్మినెంట్‌గా భవిష్యత్తును కోల్పోవద్దన్నారు.సోమవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలను నమ్ముకుని.. ప్రజలకు డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారని అనుకుంటే పొరపాటన్నారు.ఎన్నికలకు నాలుగు రోజుల ముందు చంద్రబాబు నాయుడు మహిళలకు రూ. 10వేలు ఇచ్చారని.. కానీ ఓట్లు రాలేదన్న విషయం ఒక్కసారి ఆలోచించాలన్నారు.ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్లి, ప్రజల తిరస్కారానికి గురికావద్దని రఘురామ వైసీపీ నేతలకు సూచించారు.

* అనంతలో లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి.జేడీఏ హాబీబ్ బాషా లైంగికంగా వేధిస్తున్నారంటూ జిల్లా ఎస్పీకి ఉద్యోగిని ఫిర్యాదు చేసింది.జేడీఏపై చర్యలు తీసుకోవాలంటూ సదరు ఉద్యోగిని తోటి మహిళా ఉద్యోగినులతో కలిసి జిల్లా ఎస్పీ సత్య యేసు బాబుకు ఫిర్యాదు చేసింది.  

* రాఖీ పౌర్ణమి రోజు అపశృతి….రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.గుండీమేడా ఇప్పటం రోడ్డులో బైక్ ని ఢీకొన్న ట్రాక్టర్ మహిళ మృతిఉయురూపాలెం రేపల్లె మండలం చెందిన పద్మావతి (45) మహిళ గుర్తింపు.

* ఛత్తీస్‌ఘడ్‌ రాష్ర్టం కోర్బా జిల్లాలో సోమవారం ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్‌తో సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.