Sports

IPLకు వివో వీడ్కోలు

బీసీసీఐకి మరో కొత్త తలనొప్పి! ఐపీఎల్‌-2020పై నీలిమబ్బులు కమ్ముకుంటున్నాయి. టైటిల్‌ స్పాన్సర్‌ ‘వివో ఇండియా’ బోర్డుతో తెగదెంపులు చేసుకొనేందుకు సిద్ధమైందని సమాచారం. వీలైతే పూర్తి కాలానికి లేదా కనీసం ఈ సీజన్‌కైనా దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఫలితంగా బోర్డుకు ఏం చేయాలో? సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కాని పరిస్థితి.