Editorials

అణుబాంబు మరకలకు 75ఏళ్లు

అణుబాంబు మరకలకు 75ఏళ్లు

జ‌పాన్‌లోని హిరోషిమా న‌గ‌రంపై అణుబాంబు దాడి జ‌రిగి నేటికి 75 ఏళ్లు అవుతున్న‌ది. 

హిరోషిమాపై అణు దాడి జ‌రిగిన మూడు రోజుల త‌ర్వాత నాగ‌సాకిపై మ‌రో అణుబాంబుతో అమెరికా దాడి చేసింది. 

రెండ‌వ ప్ర‌పంచ యుద్ధం స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆ త‌ర్వాత ఆగ‌స్టు 15వ తేదీన జ‌పాన్ లొంగిపోయింది.

తొలిసారి అమెరికా అణుబాంబును వాడింది హిరోషిమాపైనే. 

జ‌పాన్ సైనిక స్థావ‌రంగా హిరోషియాకు గుర్తింపు ఉన్న‌ది.

అందుకే ఈ న‌గ‌రాన్ని అమెరికా టార్గెట్ చేసింది. యూఎస్ బీ-29 బాంబ‌ర్.. 4 ట‌న్నుల లిటిల్ బాయ్ యురేనియం బాంబును దాదాపు 31500 ఫీట్ల ఎత్తు నుంచి డ్రాప్ చేశారు.

43 సెక‌న్ల త‌ర్వాత పేలిన ఆ బాంబు… సుమారు 4వేల డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌ల‌ను పుట్టించింది.

బాంబు వ‌దిలిన ప్రాంతంలో సుమారు రెండు కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో అంతా నాశ‌న‌మైంది.

ఈ దాడిలో దాదాపు ల‌క్షా 40 వేల మంది మ‌ర‌ణించారు.