Sports

సెహ్వాగ్ క్రమశిక్షణ అద్భుతం

సెహ్వాగ్ క్రమశిక్షణ అద్భుతం

టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ గొప్ప నిజాయతీపరుడని, అదే అతడి బలమని మాజీ బ్యాట్స్‌మన్‌, క్రికెట్‌ వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. గౌరవ్‌కపూర్‌ అనే వ్యాఖ్యాతతో ‘22 యార్డ్స్‌’ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ సెహ్వాగ్‌ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీరూ ఏం చేయగలడో, ఏం చేయలేడో అనే విషయాలపై చాలా స్పష్టంగా ఉంటాడని చెప్పాడు. అలాగే టెస్టుల్లో 8 వేలకు పైగా పరుగులు చేసినా అతనెప్పుడూ బౌన్సర్‌ బంతిని ఆడలేదని, అతడి నిబద్ధత, క్రమశిక్షణ అలాంటివని వ్యాఖ్యానించాడు.