Politics

ఫ్లైఓవర్ పనులపై గడ్కరీతో కేశినేని భేటీ

ఫ్లైఓవర్ పనులపై గడ్కరీతో కేశినేని భేటీ

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తో సమావేశమైన ఎంపీ కేశినేని నాని

కనకదుర్గా ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ని కోరారు

ఎంపీ శ్రీ కేశినేని నాని గారు, రహదారులు మరియు రవాణా శాఖా కేంద్ర మంత్రి వర్యులు శ్రీ.నితిన్ గడ్కరీ గారిని ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న కనకదుర్గా ఫ్లైఓవర్ పనుల పూర్తి వివరాలను తెలియజేశారు.

బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ మరియు నందిగామ-కంచికచర్ల హైదరాబాద్ రహదారి, విజయవాడ-బందరు రహదార్ల, తిరువూరు-విజయవాడ రహదారి నిర్మాణ పనులలో నితిన్ గడ్కరీ చేసిన విశేష కృషిని గుర్తు చేసుకున్నారు.

గడ్కరీ చూపిన శ్రద్ధ వల్లనే ఈ రోజు ఫ్లైఓవర్ పనులు పూర్తి దశకు వచ్చాయని, విజయవాడ అభివృద్ధికి మరింత సాయం చేయాలని కోరారు.

కొన్ని దశాబ్దాలపాటు విజయవాడ నగర వాసులు దుర్గ గుడి దగ్గర ట్రాఫిక్ ఇక్కట్లు పడ్డారు.

విజయవాడ టిడిపి ఎంపీ కేశినేని నాని దుర్గగుడి ఫ్లై ఓవర్ విషయంలో చాలా సీరియస్ గా ముందుకు కదిలి… ఫ్లైఓవర్ పనులు మొత్తం పూర్తి చేయడం జరిగింది

ఈ ఫ్లైఓవర్ పనులు కంప్లీట్ కావడంతో దాదాపు విజయవాడ నగరంలో 50 శాతం ట్రాఫిక్ క్లియర్ అయింది