Politics

సెప్టెంబరు 7 నుండి తెలంగాణా అసెంబ్లీ

సెప్టెంబరు 7 నుండి తెలంగాణా అసెంబ్లీ

సెప్టెంబర్ 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వరదలు సహా పలు అంశాలపై నేడు సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నందున అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం వల్ల ముఖ్యమైన అంశాలపై సమగ్ర చర్చ జరిపే అవకాశం ఉంటుందని సీఎం కేసీఆర్, మంత్రులు అభిప్రాయపడ్డారు. కనీసం 15 రోజుల పనిదినాలైనా ఉండాలన్నారు

వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం కావాలని సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారులను కోరారు