Business

ఇండియాలో పెట్టుబడులు శుద్ధదండగ

ఇండియాలో పెట్టుబడులు శుద్ధదండగ

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెరికాకు చెందిన మోటర్ సైకిల్ సంస్థ హార్లే డేవిడ్‌సన్ ఇండియాలో తన కార్యకలాపాల్ని నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. దశాబ్దం క్రితం ఇండియాలో అడుగుపెట్టిన ఈ కంపెనీకి ఇక్కడ ఆశించిన స్థాయిలో ప్రజాదరణ పొందలేకపోయింది. అంతే కాకుండా ఇండియాలోని ఇతర మోటర్ సైకిల్ కంపెనీలతో పోటీని ఎదుర్కోలేకపోయింది. ద్వితీయ త్రైమాసికంలో వచ్చిన ఆదాయం గురించి హార్లే డేవిడ్‌సన్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ‘‘ఇండియాలో లాభదాయకతకు పెట్టుబడుల విలువకు అంతగా ప్రాధాన్యం ఉండదు. ఒక్క ఇండియాలోనే కాకుండా అంతర్జాతీయ విపణిలో సైతం తన ఉనికిని గురించి హార్లే డేవిడ్‌సన్ పరిశీలిస్తోంది.’’ అని అన్నారు. గతేడాది ఇండియాలో కేవలం 2,500 యూనిట్ల విక్రయాలు మాత్రమే జరిగాయట. ఇక ఏప్రిల్-జూన్ మధ్య కేవలం 100 బైక్‌లు మాత్రమే అమ్ముడుపోయానని హార్లే డేవిడ్‌సన్ ప్రకటించింది. అయితే అమెరికా, యూరప్‌, పసిఫిక్ ఆసియాలలో కొత్త మార్కెట్‌లను సృష్టించుకునేందుకు హార్లే ప్రయత్నాలు ప్రారంభించిందట.