NRI-NRT

కొత్తగూడెం కూచిపూడిలలో TPAD సేవా కార్యక్రమాలు

కొత్తగూడెం కూచిపూడిలలో TPAD సేవా కార్యక్రమాలు

తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ అఫ్ డాలస్ (టీపాడ్) ఆధ్వర్యంలో కొత్తగూడెంలో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి నిత్యావసరాలను స్థానిక సెయింట్ జోసెఫ్ పాఠశాలలో అందజేశారు. కొత్తగూడెం స్థానికులు సతీష్, జ్యోతి, కాల్వ సుధాకర్, అక్రమ్, షాబుద్దీన్, శ్రీనివాస్, నాగారాజు, స్వరూప, సుజాత, మల్లేశ్వరి, సెయింట్ జోసెఫ్ హై స్కూల్ ప్రిన్సిపాల్ ప్రేమ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా నర్వ మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో N95 మాస్కులు, శానిటైజర్లను అందించారు. కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో 25కుటుంబాలకు నిత్యావసరాలను అందించారు. టీపాడ్ అధ్యక్షులు రవికాంత్ రెడ్డి మామిడి, కార్యదర్శి అనురాధ మేకల, ఫౌండింగ్ కమిటీ చైర్ రావు కల్వల, బోర్డు అఫ్ ట్రస్టీస్ చైర్ మాధవి సుంకిరెడ్డి, కో ఆర్డినేటర్ బుచ్చిరెడ్డి గోలి తదితరులు ఈ కార్యక్రమాలకు చేయూతనందించారు.