Sports

మలింగా మరింత ఆలస్యంగా

మలింగా మరింత ఆలస్యంగా

శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగ ఈసారి ఐపీఎల్‌లో తమ ఫ్రాంఛైజీ ముంబయి ఇండియన్స్‌ తరఫున ఆలస్యంగా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అతడి తండ్రి ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నాడని, కొద్ది రోజుల్లో శస్త్రచికిత్స జరగనుందని ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో పేర్కొంది. ఈ కారణం చేతనే అతడిప్పుడు తన తండ్రి వద్ద ఉండాలనుకున్నట్లు, తర్వాత ఐపీఎల్‌లో కీలక సమయం వచ్చేసరికి యూఏఈలో జట్టుతో కలిసిపోతాడని తెలిపింది. అయితే, ఈ విషయంపై ముంబయి ఇండియన్స్‌ కానీ, మలింగా కానీ స్పందించలేదు.