NRI-NRT

తెదేపా సోషల్ మీడియా కన్వీనర్ కుటుంబానికి ఎన్నారై తెదేపా సాయం

తెదేపా సోషల్ మీడియా కన్వీనర్ కుటుంబానికి ఎన్నారై తెదేపా సాయం

భీమవరం తెదేపా సోషల్ మీడియా కన్వీనర్ పసరకొండ శ్రీనివాస్ శర్మ కుటుంబానికి ఎన్ఆర్ఐ టి.డి.పి ఆధ్వర్యంలో రూ.2లక్షల73వేలు ఆర్థిక సాయాన్ని జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామ లక్ష్మి వారి కార్యాలయంలో అందజేశారు. ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ళ నాగేశ్వరరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మెంటే కాశీ విశ్వేశ్వర రావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉప్పులూరి చంద్రశేఖర్, పట్టణ వాణిజ్య విభాగం అధ్యక్షుడు ఎం.గుణేశ్వర రావు, షేక్ ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నారై తెదేపా సాయానికి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.