Movies

సుశాంత్‌కు దుబాయి డ్రగ్స్ మాఫియాకు సంబంధం!

సుశాంత్‌కు దుబాయి డ్రగ్స్ మాఫియాకు సంబంధం!

దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్‌పుత్ మృతికేసులో బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణియన్ స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ ‘‘హత్య’’ జరిగిన రోజు దుబాయ్ డ్రగ్ డీలర్ అయష్ ఖాన్ అతడిని కలిసినట్టు స్వామి ఆరోపించారు. ఇవాళ ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ… ‘‘సునంద పుష్కర్ మృతి కేసులో, పోస్టుమార్టం సందర్భంగా ఎయిమ్స్ వైద్యులు ఆమె కడుపులో ఏమి గుర్తించారో అదే అసలైన ఆధారంగా నిలిచింది. కానీ శ్రీదేవి, సుశాంత్ విషయంలో ఇది జరగలేదు. సుశాంత్ విషయానికొస్తే.. సుశాంత్ హత్యకు గురైన రోజు దుబాయ్‌ డ్రగ్ డీలర్ అయష్ ఖాన్ అతడిని కలిశాడు. ఎందుకు?’’ అని ప్రశ్నించారు. కాగా గత వారంలో కూడా సుశాంత్ మృతి కేసుతో దుబాయ్‌కి లింకు ఉందంటూ స్వామి ఆరోపించిన విషయం తెలిసిందే. శ్రీదేవి సహా గతంలో నమోదైన హైప్రొఫైల్ మృతి కేసుల్లోనూ సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.