Politics

రాజధానిపై జనసేన పార్టీ సమావేశం

రాజధానిపై జనసేన పార్టీ సమావేశం

రాజధాని తలింపు అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. అలాగే శనివారం నాడు టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఇతర నేతలను సంప్రదించి భవిష్యత్తు కార్యాచరణపై వారి అభిప్రాయాలను పవన్ అడిగి తెలుసుకోనున్నారు. రాజధాని తరలింపు వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అన్ని రాజకీయ పక్షాలకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ నేతల మనోగతం తెలుసుకోవాలని జనసేనాని భావిస్తున్నారు.