Business

దిగిరాని సరుకుల ధరలు

దిగిరాని సరుకుల ధరలు

ఒకవైపు కరోనా ఉరుముతుంటే.. మరోవైపు నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. లాక్‌డౌన్‌లోనే కాదు.. అన్‌లాక్‌ మొదలైన తర్వాత జులైలోనూ వంట నూనెల మంటలు మండాయి. ఏడాదిలో ఒక్కో లీటరుపై ఏకంగా రూ.10-30 వరకు పెరిగాయి. చింతపండు 48% పెరిగింది. పెసర, మినపపప్పుల ధరలూ పెరిగాయి. ఆగస్టులోనూ ఇంచుమించు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. కరోనాతో ఉపాధి కోల్పోయి ఆదాయం లేక అల్లాడుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఇది మోయలేని భారంగా మారింది.