Devotional

ముగిసిన కాణిపాకం వినాయకుని బ్రహ్మోత్సవాలు

ముగిసిన కాణిపాకం వినాయకుని బ్రహ్మోత్సవాలు

కాణిపాక వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ప్రత్యేక ఉత్సవాల్లో స్వామివారు అధికార నంది వాహనం పై భక్తులకు కనువిందు చేశారు. కాణిపాకంలోని శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయకుని ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో నవరాత్రి ఉత్సవాలు సోమవారంతో ముగిసింది. నేటి నుంచి 12 రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలు జరగనున్నాయి ఈ క్రమంలో మంగళవారం రాత్రి స్వామివారు అధికార నంది వాహనం పై దర్శనమిచ్చారు. స్వామివారి ఉత్సవ మూర్తికి అభిషేకం చేసిన తర్వాత స్వామి వారిని అలంకరించి ఆలయంలోనే ఊరేగించారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.