Politics

చంద్రబాబుకు పోలీసు నోటీసులు

చంద్రబాబుకు పోలీసు నోటీసులు

ఓం ప్రతాప్ మృతి కేసులో చంద్రబాబుకు నోటీసులు

చిత్తూరు జిల్లాలో ఓం ప్రతాప్ అనే యువకుడి ఆత్మహత్య
పెద్దిరెడ్డి వర్గం వేధింపులే కారణమన్న చంద్రబాబు
ఆధారాలతో హాజరు కావాలంటూ డీఎస్పీ నోటీసులు

వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక చిత్తూరు జిల్లాలో ఓం ప్రతాప్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఓం ప్రతాప్ ఆత్మహత్యకు మంత్రి పెద్దిరెడ్డి వర్గమే కారణమని ఆరోపిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డీజీపీకి లేఖ రాయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఓం ప్రతాప్ మృతి కేసులో చంద్రబాబుకు పోలీసులు నోటీసులు పంపారు. సీఆర్పీసీ 91 ప్రకారం మదనపల్లె డీఎస్పీ ఈ నోటీసులు జారీ చేశారు. ఓం ప్రతాప్ మృతిపై సాక్ష్యాధారాలు ఉంటే ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వారంలోగా కార్యాలయానికి హాజరై ఆధారాలు ఇవ్వాలని డీఎస్పీ స్పష్టం చేశారు.