Movies

సీబీఐ విచారణలో రియా తల్లిదండ్రులు

రియా తల్లిదండ్రుల విచారణ

నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌​ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి తల్లిదండ్రులు మంగళవారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. ముంబైలో రియాను విచారించిన డీర్‌డీఓ గెస్ట్‌హౌజ్‌లోనే ఆమె తల్లిదండ్రులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే సుశాంత్ కేసులో రియా చక్రవర్తి తల్లిదండ్రులను సీబీఐ ప్రశ్నించడం ఇదే మొదటిసారి. తన కుమారుడిని మానసికంగా వేధించడంతోపాటు అతడి బ్యాంకు ఖాతాలో నుంచి డబ్బుని అక్రమంగా మళ్లించారని సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ ఆరోపిస్తూ బిహార్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదులో రియాతోపాటు ఆమె తల్లిండ్రుల పేర్లు కూడా ఉన్నాయి.