NRI-NRT

కొలంబస్‌లో పీవీ శతజయంతి ఉత్సవం

కొలంబస్‌లో పీవీ శతజయంతి ఉత్సవం

ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాలు : పీవీ కమిటి సభ్యుడు , ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల

మొట్ట మొదటి సభ సెప్టెంబర్ 5 న అమెరికాలోని కొలంబస్, ఒహియోలో పీవీ శతజయంతి ఉత్సవాలు

కార్యక్రమములో పాల్గొననున్న కమిటీ అధ్యక్షుడు, ఎంపీ కే కేశవరావు,పీవీ కుటుంబ సభ్యులు కుమార్తె వాణిదేవి.

కెసిఆర్ తలపెట్టిన పీవీ శతజయంతి ఉత్సవాలలో భాగంగా మొట్టమొదటి సారి అమెరికాలోని కొలంబస్ ఓహియోలో ప్రారంభ సభ సెప్టెంబర్ 5 న నిర్వహిస్తున్నట్టు పీవీ కమిటీ సభ్యుడు ఎన్నారై కమిటి కో ఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు. ఈ సమావేశములో పీవీ శత జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ కే కేశవరావు,పీవీ కుటుంబ సభ్యులు కుమార్తె వాణిదేవి పాల్గొంటారు.

ఈ కార్యక్రమాన్ని లైవ్ లో వీక్షించడానికి ఏర్పాటు చేశారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 6:00 గంటల నుంచి క్రింది సోషల్ మీడియా లింక్స్ ద్వారా లైవ్ లో వీక్షించవచ్చు.

Youtube :https://www.youtube.com/tvasiatelugu
Facebook Live: https://www.facebook.com/TVASIATELUGUUSA/