Politics

నేడు దాదాభాయి నౌరోజీ జయంతి

నేడు దాదాభాయి నౌరోజీ జయంతి

ది గ్రాండ్ ఓల్డ్ మేన్ ఆఫ్ ఇండియా గా పిలుచుకునే దాదాబాయి నౌరోజీ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ…

జయంతి 4 సెప్టెంబరు 1825
వర్థంతి 30 జూన్ 1917

వ్యాపారవేత్త, రాజకీయనేత,బ్రిటీష్ చట్టసభ సభ్యుడైన తొలి ఆసియా ఖండ వాసి అయిన దాదాభాయ్ నౌరోజీ 4 సెప్టెంబరు 1825న నవసారిలో జన్మించారు. పార్సీ మతానికి చెందిన విద్యావేత్త, మేధావి, పత్తి వ్యాపారి మరియు తొలితరం రాజకీయ మరియు సామాజిక నాయకుడు. బరోడా మహారాజు శయాజీరావు గైక్వాడ్-3 కాలంలో సంస్థాన దివానుగా పనిచేశారు. ఈయన 1892 నుండి 1895 వరకు ఇంగ్లాండు చట్టసభ అయిన యునైటెడ్ కింగ్‍డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో కొనసాగారు. ఈయన ఈ పదవి పొందిన మొదటి ఆసియా వ్యక్తి. “గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియా”గా ప్రసిద్ధి చెందిన నౌరోజీ భారత జాతీయ కాంగ్రెస్ ప్రముఖ నేతలలో ఒకరు. ఈయన రాసిన పుస్తకం “పావర్టీ అండ్ అన్‍బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా” అనే పుస్తకం భారతదేశం నుండి బ్రిటన్ తరలిస్తున్న నిధుల గురించి వివరించిన మొదటి పుస్తకం. ఈయన 30 జూన్ 1917న మరణించారు.

*** భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా:
దాదాభాయి నౌరోజీ భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరుగానే కాకుండా ఈ సంస్థ స్థాపనకు కారకులైన ఒకరుగా ఉన్నారు. 1886లో కలకత్త (నేటి కోల్‌కత)లో జరిగిన రెండో కాంగ్రెస్ సమావేశానికి ఈయన అధ్యక్షత వహించారు. 1893లో లాహోరులో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి రెండోసారి అధ్యక్షత వహించారు. 1906లో జరిగిన కలకత్తా సమావేశానికి కూడా అధ్యక్షత వహించి మూడు సార్లు ఈ పదవి పొందిన తొలి నాయకుడిగా అవతరించారు.

*** డ్రెయిన్ సిద్ధాంతము:
భారతదేశం నుంచి సంపద ఇంగ్లాండుకు తరలి వెళుతుదని భావించి ఆధారాలతో సహా పేర్కొని తన ప్రఖ్యాత “పావర్టీ ఇన్ ఇండియా” గ్రంథంలో దీని గురించి వివరించారు. దీనికి 6 కారకాలు కూడా పేర్కొన్నారు. దీనివల్ల భారతదేశానికి ఏటా 200-300 పౌండ్ల నష్టం నరుగుతుందని వివరించారు. జాతీయాదాయ అంచనాలు వివరించడంలో కూడా ఈయన ప్రసిద్ధి పొందారు.

*** రచనలు:
దాదాబాయి నౌరోజీ పలు గ్రంథాలు రచించారు. వాటిలో ముఖ్యమైనవి- The manners and customs of the Parsees, The European and Asiatic races, The wants and means of India, Poverty and Un-British Rule in India, The Parsee Religion.