NRI-NRT

నాట్స్ డబుల్స్ టెన్నిస్ పోటీల విజేతగా బండి-మైల

NATS Double Tennis 2020 Tournament Winners

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) ఆధ్వర్యంలో న్యూజెర్సీలో టెన్నీస్ డబుల్స్ టోర్నమెంట్ నిర్వహించారు. తుదిసమరంలో ప్లయిన్స్‌బొరో టీం (కృష్ణ కిషోర్ బండి, వాసుదేవ మైల) ఈ పోటీల విజేతగా నిలిచింది. సౌత్ జెర్సీ టీం(సందీప్ అనంతుల, రమేశ్ జంగా) రన్నరప్‌గా నిలిచారు. నాట్స్ బోర్డు డైరెక్టర్ మోహనకృష్ణ మన్నవ, నాట్స్ నేషనల్ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ కొణిదెల, నాట్స్ ప్రతినిధులు కుమార్ వెనిగళ్ల, వంశీ వెనిగళ్ల ఈ పోటీలకు సహకరించారు. విజేతలకు బహుమతులు అందించారు. అరుణ గంటి, గంగాధర్ దేసు, సూర్యం గంటి, శ్రీహరి మందాడి, రాజ్ అల్లాడ, రంజిత్ చాగంటి, శ్యాం నాళం, రమేశ్ నూతలపాటి, మురళీ మేడిచర్ల, చక్రధర్ ఓలేటి, విష్ణు ఆలూరు, సురేశ్ బొల్లు, సూర్య గుత్తికొండ, రాజేశ్ బేతపూడి, శ్రీనివాస్ మెంట, శేషగిరి కంభంమెట్టు, శ్రీనివాస్ భీమినేని, శ్రీథర్ దోనేపూడి, ప్రశాంత్ గోరంట్ల, రామకృష్ణ నరేడ్ల, విష్ణు కనపర్తి, సుధాకర్ తురగా, రాకేశ్ దొమ్మాలపాటి, కిరణ్ చాగర్లమూడి తదితరులు పాల్గొన్నారు.