ఆంధ్రప్రదేశ్లోని అన్ని పార్టీల ఎంపీలతో వర్చువల్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. ఈ మేరకు సీఎంకు ఆయన బుధవారం లేఖ రాశారు. సెప్టెంబర్ 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నందున సమావేశం ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు. పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలు, కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన వాటిపై చర్చించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు ముఖ్యమంత్రులు ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేయడం ఆనవాయితీ అని ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు గుర్తు చేశారు. ఈ ఆనవాయితీని కొనసాగించాలని సీఎంను కోరారు.
జగన్కు రాజకీయ ఆనవాయితీ గుర్తుచేసిన రఘురామరాజు
Related tags :