Movies

నన్ను ఒత్తిడి చేస్తున్నారు

నన్ను ఒత్తిడి చేస్తున్నారు

నేరాన్ని ఒప్పుకొనేలా బలవంతం చేశారంటూ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నిందితురాలిగా ఉన్న నటి రియా చక్రవర్తి ఆరోపించారు. బుధవారం సెషన్స్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆమె..తాను ఎటువంటి నేరం చేయలేదని, తనను తప్పుగా ఇందులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేరాన్ని అంగీకరించాలంటూ కస్టడీలో ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చారు. కస్టడీ సమయంలో తాను అంగీకరించిన అంశాలను అధికారికంగా ఉపసంహరించుకుంటున్నారు’ అని ఆమె తరఫు న్యాయవాది పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే ఆమె అరెస్టు అనవసరమైందని, ఆమె స్వేచ్ఛను పూర్తిగా హరించారని ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆమెను ప్రశ్నించే సమయంలో ఒక్క మహిళా అధికారి కూడా లేరని న్యాయస్థానానికి విన్నవించారు. కాగా, సుశాంత్ మృతి కేసును దర్యాప్తు చేస్తోన్న క్రమంలో మాదకద్రవ్యాల కోణం బయటపడటంతో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో రియాను మూడు రోజుల పాటు విచారించి, జ్యుడీషియల్‌ కస్టడీలోకి తీసుకుంది.