NRI-NRT

విదేశాలకు పంపే నిధులపై 5% పన్ను

విదేశాలకు పంపే నిధులపై 5% పన్ను

వచ్చే నెల నుంచి లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీంలో ఆర్బీఐ మార్పులు చేస్తున్నది. ఈ స్కీం కింద విదేశాలకు డబ్బు పంపే వారికి 5 శాతం చొప్పున టీసీఎస్ వసూలు చేయనున్నారు. ఈ విధానం అక్టోబర్ 1 నుంచి ప్రారంభించేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకుంటున్నది. ఈ నిబంధనను ఫైనాన్స్ యాక్ట్ 2020 లో తీసుకొచ్చారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం 206 సీ సెక్షన్ కు సవరణను ప్రతిపాదించి.. విదేశీ చెల్లింపులు, విదేశీ టూర్ ప్యాకేజీల అమ్మకాలపై 5 శాతం టీసీఎస్ విధించింది. ఈ నిబంధనలను అమలు చేయడానికి మార్చి 27 న నోటిఫై చేసిన ఆర్థిక చట్టం అక్టోబర్ ఒకటో తేదీని నిర్దేశిస్తుంది. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే టీసీఎస్ నిబంధనను చాలా ఆర్థిక సంస్థలు తమ ఖాతాదారులకు నోటీసు రూపంలో పంపి సమాచారమిచ్చాయి.
**టీసీఎస్ కేటాయింపులో డిస్కౌంట్లు
* విదేశాలకు పంపిన మొత్తం రూ.7 లక్షల కన్నా తక్కువ ఉంటే (టూర్ ప్యాకేజీ కొనడానికి కాకుండా) దానికి టీసీఎస్ వసూలు ఉండదు.
* రూ.7 లక్షలకు మించి చెల్లించినట్లయితే (టూర్ ప్యాకేజీని కొనడానికి కాకుండా) రూ.7 లక్షలకు పైబడిన మొత్తానికి టీసీఎస్ విధిస్తారు.
* విదేశాలలో చదువుకోవడానికి ఒక ఆర్థిక సంస్థ జారీ చేసిన రుణాల విషయంలో రూ.7 లక్షల పరిమితికి మించి ఉన్న మొత్తంలో టీసీఎస్‌లో 0.5 శాతం మాత్రమే వసూలు చేయబడుతుంది.
* పాన్ లేదా ఆధార్‌తో చెల్లింపులు చేయకపోతే టీసీఎస్ రేటు 10 శాతం ఉంటుంది.
* టీసీఎస్‌గా తగ్గించిన మొత్తానికి జీఎస్‌టీ విధిస్తారు.
* ఆదాయపు పన్ను చట్టంలోని ఏదైనా నిబంధన టీడిఎస్‌ను పంపించాల్సిన మొత్తానికి తీసివేసి, టీడీఎస్‌ను తీసివేస్తే, ఆ మొత్తానికి టీసీఎస్ నిబంధన వర్తించదు.
* ప్రభుత్వం లేదా ప్రభుత్వం నిర్ణయించిన వ్యక్తి విదేశాలకు డబ్బు పంపితే దానికి టీసీఎస్‌ను ఉండదు.
* విదేశాలకు డబ్బు పంపించే వ్యక్తి తన పన్ను రిటర్న్‌లో బ్యాంక్ తీసివేసిన టీసీఎస్‌కు క్రెడిట్‌ను కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు.