Fashion

కొబ్బరిపాల స్నానంతో చర్మకాంతి

కొబ్బరిపాల స్నానంతో చర్మకాంతి

చర్మ సౌందర్యం కోసం తాపత్రయపడని వారుండరు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో దొరికే రసాయనిక క్రీమ్స్‌ వాడుతుంటారు. ఫలితంగా ఉన్న అందాన్ని కాస్తా పోగొట్టుకుంటారు. ఈ చిట్కాలు పాటిస్తే చర్మ సౌందర్యాన్ని పొందవచ్చు.ోరువెచ్చని నీటిలో కొద్దిగా రోజ్‌వాటర్‌, కొబ్బరి పాలు కలలుపాలి. ఈ మిశ్రమాన్ని స్నానానికి ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల బాగా నిర్జీవమైన చర్మం తిరిగి తాజాదనాన్ని సంతరించుకుంటుంది. కొబ్బరిపాలను నేరుగా చర్మానికి ఐప్లె చేసుకొని సాఫ్ట్‌గా మర్దనా చేసుకోవచ్చు. ఇలా చేస్తే చర్మానికి తేమ అందుతుంది. గులాబీ రేకులు, చెంచా తేనె, అరకప్పు కొబ్బరి పాలను బకెట్‌ గోరువెచ్చని నీటిలో వేసుకొని స్నానం చేయాలి. దానివల్ల శరీరానికి తగిన తేమ అంది మేని కాంతివంతంగా తయారవుతుంది. కొబ్బరి పాలల్లో రెండు చుక్కల నిమ్మరసం కలిపి పది నిమిషాల తర్వాత అందులో దూదిని ముంచి ముఖమంతా అద్దుకోవాలి. కాసేపయ్యాక కడిగేస్తే ముఖంపై పేరుకున్న మురికి తొలిగి తాజాగా మారుతుంది. కప్పు కొబ్బరి పాలల్లో చెంచా చొప్పున బాదం, తులసి పొడులు, రెండు చుక్కల తేనె చేర్చాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత నీటితో తడిపి నలుగులా రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే మృతకణాలు తొలగి చర్మం మృదువుగా తయారవుతుంది.