Movies

నాకు సిగ్గు ఎక్కువ

నాకు సిగ్గు ఎక్కువ

తాను ఎప్పుడూ సినిమాల్లోకి రావాలనుకోలేదని అంటున్నారు బాలీవుడ్‌ నటి దిశాపటానీ. తన ఫిట్‌నెస్‌తో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న ఈ నటి ప్రస్తుతం ‘మలంగ్‌’ సినిమాతోపాటు సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘రాధే’ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉంటుంది. తాజాగా దిశా తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికర విశేషాలను విలేకర్లతో పంచుకున్నారు. ‘చిన్నప్పడు నుంచి నాకు సిగ్గు ఎక్కువగా ఉండేది. సినిమాల్లోకి రాకముందు కనీసం ఫొటోలు కూడా తీసుకునేదాన్ని ఎందుకుంటే కెమెరా ముందు నిల్చొవాలంటే భయం, సిగ్గు వేసేది. అప్పట్లో నాకు నటినవ్వాలనే ఉద్దేశం కూడా లేదు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. ఇప్పుడు ఇలా మీ ముందు ఉన్నాను.’ అని దిశా తెలిపారు.అనంతరం రాధే సినిమాలో తాను నటించడానికి గల కారణాన్ని తెలిపారు. ‘ఈ సినిమాలో నటిస్తావా అని సల్మాన్‌ సర్‌ అడిగినప్పుడు వెంటనే ఓకే చెప్పేశాను. సల్మాన్ సర్‌ కథానాయకుడిగా ప్రభుదేవా డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నటించడానికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది. అది ఏమిటంటే.. ఈ సినిమా కథతోపాటు నా పాత్ర కూడా బాగా నచ్చింది అందుకే వెంటనే ఓకే చెప్పేశాను.’ అని దిశా వివరించారు