DailyDose

బాలికపై గ్యాంగ్‌రేప్-నేరవార్తలు

బాలికపై గ్యాంగ్‌రేప్-నేరవార్తలు

* కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ మండలం చింతకొమ్మదిన్నెలో బిస్కెట్లను తిని ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, కర్నూలు ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న మరో బాలిక జమాల్ బి ఈరోజు తెల్లవారుజామున మృతి.

* కామారెడ్డి ఆర్డీవో సస్పెన్షన్‌.అప్పటి జిన్నారం డిప్యూటీ తహసీల్దారుపైనా వేటు…ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌.సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూములు కట్టబెట్టడంతో చర్యలు.మరికొందరు సిబ్బందిపై క్రిమినల్‌ చర్యలకు రంగం సిద్ధం.నిషేధిత జాబితాలో ఉన్న భూములకు నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) ఇప్పించేందుకు రూ.1.12 కోట్ల లంచం డిమాండ్‌ చేసి అనిశాకు పట్టుబడిన మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ నగేష్‌ ఉదంతం మర్చిపోకమునుపే రెవెన్యూ శాఖలో మరో బాగోతం వెలుగుచూసింది. అదే ఉమ్మడి జిల్లాలో గతంలో జరిగిన భూదందాలో కీలకంగా వ్యవహరించిన ప్రస్తుత కామారెడ్డి ఆర్డీవో జి.నరేందర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో తహసీల్దారుగా పనిచేసిన సమయంలో దస్త్రాలను మార్చి ఖాజీపల్లిలోని రూ.కోట్ల విలువైన 20 ఎకరాల ప్రభుత్వ భూమిని నలుగురికి కట్టబెట్టిన వ్యవహారంలో ఆయన ప్రమేయం ఉందనే నివేదిక ఆధారంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జిన్నారం మండల డిప్యూటీ తహసీల్దారుగా పనిచేసిన కె.నారాయణనూ సస్పెండ్‌ చేసినట్టు అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం నారాయణ మెదక్‌ కలెక్టరేట్‌లో అదే హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరితోపాటు ఖాజీపల్లి వీఆర్వో జె.వెంకటేశ్వర్‌రావు, జిన్నారం ఆర్‌ఐ జి.విష్ణువర్ధన్‌, మండల సర్వేయర్‌ ఎన్‌.లింగారెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్‌ ఆర్‌.ఎం.ఈశ్వరప్ప, సూపరింటెండెంట్‌ సహదేవ్‌, 2019లో పనిచేసిన సంగారెడ్డి ఆర్డీవోలతోపాటు ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న ప్రైవేటు వ్యక్తులపైనా క్రిమినల్‌ చర్యలు తీసుకోవడంతోపాటు, అక్రమ మార్గాల్లో పొందిన అసైన్‌మెంట్‌ పట్టాలను కూడా రద్దు చేసే దిశగా సర్కారు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.చనిపోయిన తహసీల్దారు సంతకం ఫోర్జరీతో దందాజిన్నారం మండలం ఖాజీపల్లిలోని సర్వే నెం.181లో ప్రభుత్వ భూములున్నాయి. 2013లో అక్కడ తహసీల్దారుగా పనిచేసిన జి.నరేందర్‌ మిగతా సిబ్బంది సహకారంతో అక్రమ దందాకు తెరదీశారు. మాజీ సైనికులైన వెంకటేశ్వర్లు, ఉప్పు రంగనాయకులు, ఎన్‌.నరేంద్రరావు, ఎం.మధులకు ఒక్కొక్కరికి ఐదు ఎకరాల చొప్పున కేటాయించారు. పైగా 2007లోనే వీరికి కేటాయింపులు చేసినట్లుగా దస్త్రాల్లో మార్పులు చేశారు. అప్పటికే మరణించిన తహసీల్దారు పరమేశ్వర్‌ సంతకాలనూ ఫోర్జరీ చేశారు.అక్రమం కోసం వేసిన ప్లాన్‌ దొరకడంతో…సదరు భూములకు నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) ఇవ్వాలంటూ 2019లో సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు వద్దకు దస్త్రం వచ్చింది. దస్త్రాన్ని పంపిన అధికారులు, అక్రమ దందా కోసం తాము వేసుకున్న ప్రణాళిక ప్రతిని(భూములను ఎవరి పేరుతో మార్చాలి, ఏయే సంవత్సరాల్లో కేటాయించినట్టు నమోదు చేయాలి తదితర వివరాలున్న కాగితం) పొరపాటున అందులోనే ఉంచేశారు. దాని ఆధారంగా కలెక్టర్‌ హనుమంతరావు సమగ్ర విచారణ చేయించడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. విచారణాధికారి 2020 జనవరిలో నివేదిక అందించగా, కలెక్టర్‌ ఏప్రిల్‌ 25న ప్రభుత్వానికి సమర్పించారు. ఈ అక్రమానికి కారకులైన అధికారులపై కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిన్నారం తహసీల్దారు పి.దశరథ్‌ జులై 15న ఐడీఏ బొల్లారం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

* కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్‌లో, గత అర్ధరాత్రి ఎస్‌ఈబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇసుక అక్రమ రవాణా కేసుల ఫైల్స్‌ను స్టేషన్ సిబ్బంది  టాంపరింగ్ చేశారనే ఆరోపణ నేపథ్యంలో, ఈ దాడులు జరుగుతున్నాయి. కీలకమైన ఫైల్స్,  కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను ఎస్‌ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

* బాచుపల్లి పీఎస్‌ పరిధి ప్రగతినగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న అభి వెంచర్‌లో పని చేయడానికి మేస్త్రీల బృందం సోమవారం ఒడిశా నుంచి వచ్చింది. తెలవారుజామున 4 గంటల సమయంలో లక్ష్మణ్‌ జా (48) అనే మేస్త్రీ అభి వెంచర్‌కు ఆనుకొని ఉన్న మరో నూతనంగా నిర్మిస్తున్న జ్యోత్స్న అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లాడు. అలికిడి కావడంతో ఆ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న నర్సింహ లక్ష్మణ్‌ను చూసి దొంగ వచ్చాడని భావించాడు. కర్రతో లక్ష్మణ్‌ తలపై కొట్టి తాడుతో బంధించాడు. వాచ్‌మన్‌ చుట్టుపక్కల వారికి సమాచారాన్ని అందించి మరోసారి కొట్టడంతో లక్ష్మణ్‌ తీవ్రగాయాలతో స్పృహ కోల్పోయాడు. పరిస్థితి విషమించడంతో చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో లక్ష్మణ్‌ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాచుపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నర్సింహను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

* నకిలీ మావోయిస్ట్ పేరుతో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. తాను ఛత్తీ‌స్‌గఢ్‌లో మావో కీలక మెంబర్ అని చెప్పి అపర్ణ కన్‌స్ట్రక్షన్ ఏజీఎంకు ఫోన్ చేసి రూ.20 లక్షలు డిమాండ్ చేశాడు. డబ్బు చెల్లించకుంటే షేయిక్ పేట్‌లో ఉన్న అపర్ణ కన్‌స్ట్రక్షన్‌ను పేల్చేస్తామని ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నగేష్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

* ఒంగోలులో ఓ రౌడీషీటర్ వీరంగం సృష్టించాడు. ఒంగోలు పోలీస్ స్టేషన్ సమీపంలో 108 అంబులెన్స్ కు రౌడీషీటర్ నిప్పుపెట్టాడు. స్థానికంగా ఉండే రౌడీషీటర్ సురేష్ఇ టీవల పదేపదే డయల్ 100కి రాంగ్ కాల్స్ చేశాడు. అంతేకాకుండా పిఎస్ కు వచ్చి తనను అరెస్టు చేయాలంటూ తలుపులు పగలగొట్టి హంగామా చేశారు. గాయాలు కావడంతో పోలీసులు 108కి పోన్ చేశారు. 108 వాహనం ఎక్కి వాహనం అద్దాలు పగలగొట్టి, వాహనంలో ఉన్న స్పిరిట్ తో 108కి నిప్పుపెట్టి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సురేష్ మానసిక పరిస్థితి బాగోలేదని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న రౌడీషీటర్ కోసం గాలిస్తున్నారు.

* టీవీ నటి శ్రావణి మృతి కేసులో ఏ 3 నిందితుడు అశోక్‌రెడ్డి పంజాగుట్ట పోలీసుల ఎదుట మంగళవారం లొంగిపోయాడు. ఏసీపీ తిరుపతన్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

* చెరుకుతోట వీడియోలు లీక్.. బాలికను రేప్ చేస్తున్న ఐదుగురు.. దారుణంసోషల్ మీడియాలో రేప్ వీడియో కలకలం రేపింది. వీడియోలు వైరల్ కావడంతో బాలికపై ఐదుగురు దుర్మార్గుల సామూహిక అత్యాచారం వెలుగులోకి వచ్చింది.మహిళ ఒంటరిగా కనిపిస్తే కామాంధులు రెచ్చిపోతున్నారు. జంకూబొంకూ లేకుండా బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారాలకు తెగబడుతున్నారు. అలాంటి దారుణ ఘటన మరోటి తాజాగా వెలుగుచూసింది. మార్కెట్‌కి వెళ్లిన బాలికను లాక్కెళ్లి ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగని దుర్మార్గులు ఆ నీచపు పనిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ అమానుష ఘటన యూపీలో చోటుచేసుకుంది.సీతాపూర్ జిల్లాకి చెందిన మైనర్ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. బాలికపై కన్నేసిన కామాంధులు షీబు, నజీమ్ మార్కెట్‌‌కి వెళ్లొస్తున్న సమయంలో ఆమెను అపహరించి నీచానికి పాల్పడ్డారు. బాలికను సమీపంలోని చెరుకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. అప్పటికే అక్కడ ఉన్న మరో ముగ్గురు స్నేహితులతో కలసి బాలికపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. పశువుల్లా మీద పడి కామకోరికలు తీర్చుకున్నారు.అంతటితో ఆగని రాక్షసులు రేప్ చేస్తూ వీడియోలు తీసి పైశాచికానికి దిగారు. ఎవరికైనా చెబితే దారుణ పరిస్థితులు ఉంటాయని బెదిరించి పంపించేశారు. తీరా ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. చెరుకుతోటలో ఐదుగురు బాలికపై రేప్ చేస్తున్న వీడియోలు కలకలం రేపాయి. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి వెంటనే పోలీసులను ఆశ్రయించింది. సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడు షీబున అరెస్టు చేశారు.