వన్డే ప్రపంచకప్ చరిత్రలో టీమ్ఇండియా తరఫున 2003లో మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా నెలకొల్పిన ఓ రికార్డును అధిగమించడం ఇప్పటివరకూ ఎవరికీ సాధ్యంకాలేదు. 1975 నుంచి 2019 దాకా ఏ ప్రపంచకప్లోనూ ఏ భారత బౌలర్ కూడా ఆ రికార్డును చేరలేదు. అదేంటంటే ఒకే మ్యాచ్లో అత్యధికంగా 6 వికెట్లు తీయడం. అప్పట్లో గంగూలీ సారథ్యంలో భారత్ ఫైనల్స్ వరకూ వెళ్లి ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. అయితే, అంతకుముందు లీగ్ దశలో ఇంగ్లాండ్తో తలపడిన ఓ మ్యాచ్లో నెహ్రా ఆరు వికెట్లు తీసి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దాంతో టీమ్ఇండియా తరఫున అమోఘమైన రికార్డు నెలకొల్పాడు. కాగా, ఆ మ్యాచ్కు ముందు ఈ మాజీ పేసర్ కుడి కాలికి గాయమైందని, దాంతో అది బాగా వాచిపోయిందని మాజీ టెస్టు ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. మంగళవారం అతడు ఫేస్బుక్ వీడియోలో మాట్లాడుతూ.. ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.
నెహ్రా రికార్డు వెనుక వాచిన కాలు
Related tags :