హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మంత్రి కొడాలి నాని మాట్లాడటం హేయమని ఎంపీ రఘురామ కృష్ణరాజు మండిపడ్డారు. పరమత సహనాన్ని కాపాడాలని సూచించారు. అనవసరంగా గొడవలకు దారితీయొద్దని హితవు పలికారు. తనను వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలంతా లక్ష్యంగా చేసుకున్నారని, వారంతా ఆత్మావలోకనం చేసుకోవాలని సూచించారు. దేవాలయాలపై జరిగిన దాడులను హిందువులకు తగిలిన గాయాలుగా రఘురామ అభివర్ణించారు. ‘‘ హిందువుల మనోభావాలను ప్రతిఒక్కరు కాపాడాలి. హిందువుల మనోభావాలకు ఇబ్బంది కలిగేలా కేబినెట్ మంత్రులు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రితో ఇలాంటి వ్యాఖ్యలు చేయించడం మంచిది కాదు. హిందువుల మనోభావాలు దెబ్బతీయొద్దు’’ అని రఘురామ కృష్ణరాజు అన్నారు.
ఏమయ్యా కొడాలి…ఏమి మాటలు అవి?
Related tags :