భారత్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చే ఏడాది ఆరంభం నాటికి సిద్ధమవుతుందని, అయితే దేశవ్యాప్తంగా 130 కోట్ల మందికి సురక్షితంగా వ్యాక్సిన్ అందించడమే అతిపెద్ద సవాలని ప్రముఖ వ్యాక్సిన్ శాస్త్రవేత్త, వ్యాక్సిన్ భద్రతపై డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ సలహా కమిటీ సభ్యులు గగన్దీప్ కాంగ్ పేర్కొన్నారు. దేశీయంగా పలు వ్యాక్సిన్లు కీలక క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకోగా వాటిని అందరికీ చేర్చే సరైన వైద్య మౌలిక సదుపాయాలు దేశంలో లేవని స్పష్టం చేశారు. ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏ వ్యాక్సిన్ సమర్ధవంతంగా పనిచేస్తుంది, ఏ వ్యాక్సిన్ ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదనే గణాంకాలు మనకు అందుబాటులో ఉంటాయని కాంగ్ చెప్పుకొచ్చారు.
వ్యాక్సిన్ వచ్చే ఏడాది వస్తుంది
Related tags :